ప్రేమమ్ అనే మలయాళీ సినిమాలోని తన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది సాయి పల్లవి. ఆ సినిమాలో తన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ తన హావభావాలతో ఆ ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమమ్ సినిమా తర్వాత సాయి పల్లవి కి వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. తన నటనలోనూ, డాన్స్ తోను సాయి పల్లవి ప్రేక్షకులను ఫిదా చేసింది. 

 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తను నటించిన 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి అద్భుతం గా నటించింది. అంతే కాకుండా ఆ సినిమాకు తెలంగాణ యాసలో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పింది. ఇలా పలు తెలుగు, తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించిన సాయి పల్లవి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని సినీ పరిశ్రమ లో వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయేది ఒక రాజకీయ నాయకుడి కొడుకుని అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. 

 

అంతే కాకుండా పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తుంది అనే మాట కూడా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. కానీ ఈ విషయం పై ఎటువంటి స్పష్టత లేదు. ఈ వార్త ఎంత వరకూ నిజం అనేది ఇకపై తెలియాలి. ప్రస్తుతం ఈ భామ తెలుగు తో పాటుగా పలు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తుంది. తమిళంలో పాప కు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువగా చెన్నై లోనే ఉంటుంది సాయి పల్లవి అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: