కరోనాకు చిన్నా పెద్ద అన్న తేడా లేదు. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ  అల్లాడిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నటి తన లాక్‌ డౌన్‌ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రముఖ టెలివిజన్‌ నటి రతన్ రాజ్‌పుత్‌ లాక్‌ డౌన్‌ కారణంగా ఓ గ్రామంలో ఇరుక్కుపోయింది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో తనకు ఎదురైన సమస్యలు అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

 

ప్రస్తుతం ఆమె ఉంటున్న ఇంట్లో బాత్‌ రూమ్‌కు డోర్‌ లేదు. కనీసం ట్యాప్ కూడాలేదు. అంతేకాదు ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ కూడా అయిపోయింది. దీంతో ఆ గ్రామీణ వాతావరణంలో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే ఈ పరిస్థితుల్లోనూ ఆమె పోరాడుతోంది. తనకు ఎదురైన సమస్యలపై యుద్ధం చేస్తోంది. అయితే ఈ సందర్భంగా ఆమె అభిమానులకు ఓ అప్పీల్ చేసింది.

 

ఈ పరిస్థితులకు ప్రభుత్వాలను నింధించ వద్దని కోరింది. అంతేకాదు పీఎం రిలీఫ్ ఫండ్‌కు మీ వంతు సాయం చేయాలని కోరింది. తాజాగా ఆదివారం సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు సంఘీభావంగా ఆమె కూడా దీపం వెలిగించి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: