మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే తెలియ ని వాళ్ళు ఉండరేమో..  మొదట మతాల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు ప్రముఖ దర్శకుల్లో ఒకరు గా హవాను కొనసాగిస్తున్నారు. ఎన్ని విజయ వంతమైన సినిమాల లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయన సినిమాలు మాటల తో, కాస్త ఎమోషన్స్ తో, మరి కాస్త ప్రేమ తో డోస్ పెంచుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 

 

 


అంతేకాక ఎందరో హీరోల కు మంచి లైఫ్ ను అందించిన ఘనత కూడా ఈయన దే.. ఈ మధ్య కొత్త హీరోలకు అవకాశం ఇవ్వాల నే ఆలోచన లో ఉన్నదని అర్థమవుతుంది. అందుకే తానూ చేయబోయే సినిమాల లో రూటు మార్చుకున్నాడని తెలుస్తుంది. ఇటీవల బన్నీ, త్రివిక్రమ్ కాంబినేష న్ లో వచ్చిన 'అల వైకుంఠపురం లో' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. 

 

 

 


అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడని వార్తలు వినపడుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఆ సినిమాను నిర్మించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట.. అలాగే మరో ప్రాజెక్టుపై కసరత్తులు చేస్తున్నారని ఫిలిం నగర్లో ఓ వార్త కోడై కూస్తుంది. అయితే ఈ సినిమాను కొత్త హీరో తో చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. 


 

 

 

ఒక వ్యాపార వేత్త తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి రంగంలోకి దిగాడట. 170 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కు పారితోషికంగా 35 కోట్లు ముట్టనున్నట్టు చెబుతున్నారు.ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యాక ఆ సినిమాను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. ఆ సినిమా ఏ రేంజులో ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: