లాక్ డౌన్ తో కరోనాని తరిమికొట్టాలన్న ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు దేశ ప్రజలు. ముఖ్యంగా ఎప్పుడు షూటింగులతో బిజీగా ఉండే స్టార్స్ మాత్రం రెండు వారాలుగా ఇళ్లలోనే ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొందరు లాక్ డౌన్ టైం లో తమలోని హిడెన్ టాలెంట్ బయటకు తీస్తున్నారు. ఇప్పటికే చిరు తన బయోగ్రఫీ రాసే పనిలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ మళయాళ భామ నిత్యా మీనన్ కూడా పెన్ను పట్టిందని తెలుస్తుంది. లాక్ డౌన్ టైం లో ఆమె రచయితగా మారినట్టు టాక్. 

 

తన చుట్టుపక్కన జరిగే విషయాలతో.. తన మనసులో ఉన్న ఆలోచనలు జోడించి స్క్రిప్ట్ రెడీ చేస్తుందట నిత్యా మీనన్. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మీనన్ ఈమధ్య కెరియర్ లో చాలా వెనుకపడ్డది. అభినయంతో మెప్పించే ఈ అమ్మడు తెలుగులో పెద్దగా ఛాన్సులు అందుకోవడం లేదు. గీతా గోవిందం సినిమాలో ఎదో ఒక చిన్న గెస్ట్ రోల్ చేసింది నిత్యా మీనన్.. ఆ తర్వాత కనిపించనే లేదు. కావాలని గ్యాప్ తీసుకుంటున్నట్టు చెబుతున్నా ఆమెకు అవకాశాలు రావట్లేదు అన్నది వాస్తవం. 

 

తెలుగులో నిత్యా మీనన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి ఆమె చేస్తా అంటే ఛాన్సులు ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారు. అయితే సరైన కథలు రావట్లేదని ఆమె సైలెంట్ గా ఉంటుంది. ఇక లాక్ డౌన్ టైం లో కథలు రాసుకుంటున్న నిత్యా మీనన్ రాబోయే రోజుల్లో దర్శకురాలిగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా నటించడం చాలా ఈజీ కానీ మెగా ఫోన్ పట్టుకోవడం కష్టం. మరి నిత్యా మీనన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: