ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఒకవైపు.. మరొక వైపు ప్రజల భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఈ కరోనా మహమ్మారి కరోనా ను పూర్తిగా తరిమి కొట్టాలి అనే లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది.
ప్రజల శ్రేయస్సు లో భాగంగా లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది. ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు.
ఈ సందర్బంగా నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ.. కుటుంబం కోసం, మన పిల్లల కోసం అందరూ ఇంట్లోనే కూర్చోవాలని విన్నవించారు. ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని... ఎవరూ బయటకు వెళ్లొద్దని కోరారు. బాల్కనీ నుంచి రోడ్లను చూస్తున్నానని... వాహనాలు తిరుగుతూనే ఉన్నాయని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇంట్లో కూర్చోవడం చాలా కష్టమేనని... అయితే మనం అనుకుంటే ఏదైనా చేయగలమని రేణు దేశాయ్ అన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తే... ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో మనకు తెలియదని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరైతే అ వైరస్ మీకు అంటుకుంటుందని... ఆ తర్వాత ఇంట్లోని వారికి కూడా సోకుతుందని అన్నారు. అందుకే కొన్ని రోజులు ఓపిక పట్టాలని, ఇంట్లోనే ఉండాలని చెప్పారు. మీ మీద మీరు నమ్మకం ఏర్పరుచుకోవాలని అన్నారు. కరోనా కట్టిడికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని చెప్పారు.కరోనా ను బుద్ది బలంతో ఎదుక్కోవాలని సూచిస్తున్నారు..