టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అంటే ఒక రేంజ్ లో ఆసక్తి ఉండేది. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండే వారు. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ తగ్గింది. ఆయన సినిమాలను పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఒకప్పుడు ఆయనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. కాని ఇప్పుడు లేదు. నిర్మాతలు లేక తన సినిమాలను తానే నిర్మించుకునే పరిస్థితి. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఇతను ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఊపు మీద ఉన్నాడు. ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఫైటర్. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. కొన్ని కారణాలతో ఇప్పుడు వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఆగిపోయింది అంటున్నారు. దానికి కారణం విజయ్ దేవరకొండ కథ లో వేలు పెట్టడమే. 

 

కథలో తనకు నచ్చిన విధంగా మార్పులు చేర్పులు చెయ్యాలని విజయ్ కోరినట్టు టాక్. దీనితో పూరి చికాకు తో ఈ సినిమాను ఆపేసి తన కొడుకు హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మరి ఇలాంటి తరుణంలో సినిమాను ఎందుకు ఆపేస్తున్నారు అనేది తెలియడం లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా పెట్టుబడులు పెట్టినట్టు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: