ఈ మద్య సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ నాట తనదైన కామెడీ పండిస్తూ కోట్ల మంది ప్రేక్షకుల మనసు దోచారు  బుల్లెట్‌ ప్రకాశ్‌ (44).  గత కొంత కాలంగా కాలేయ, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   జీర్ణ సంబంధమైన సమస్యతో ఆయన మార్చి 31న ఆస్పత్రిలో చేరగా.. కిడ్ని, కాలేయ వ్యాధులు ఉన్నాయని తేలింది. ఈక్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారని ప్రకాశ్‌ సన్నిహితులు తెలిపారు.

 

కాగా, 300లకు పైగా సినిమాల్లో నటించిన ప్రకాశ్‌ కన్నడ సినీ రంగంలో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించారు.  ఒకప్పుడు కన్నడ నాట ఆయన నటించిన సినిమాల్లో తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఆహ్లాదపరిచారు.  సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు బుల్లెట్ ప్రకాశ్ గా మారింది. ఆయన హావభావాలకు గాను బుల్లెట్‌ ప్రకాశ్‌గా పేరు స్థిరపడిపోయింది. బిగ్‌బాస్‌ కన్నడ సీజన్‌-2లో కూడా ఆయన పాల్గొన్నారు. బిగ్ బాస్ హౌజ్ లో కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు ప్రకాశ్. 

 

అంతే కాదు కొంత కాలంగా ప్రకాశ్‌ బీజేపీ కార్యకర్తగా పనిచేశారు. ఎంతో మంది సీనియర్లతో తన కామెడీ పండించారు ప్రకాశ్.  మస్త్‌ మజా మాది (2008), అయితలకడి (2010), మల్లిఖారుజన (2011), ఆర్యన్‌ (2014) సినిమాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తీసుకొచ్చాయి.   పునీత్‌ రాజ్‌కుమార్‌, దర్శన్‌, శివరాజ్‌కుమార్‌, ఉపేంద్ర, సుదీప్‌ కిచ్చ లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు బుల్లెట్ ప్రకాశ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: