ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా ను పూర్తిగా తరిమి కొట్టాలి అనే లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ ను విధించింది. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎంత నియంత్రణ చేసిన కూడా కరోనా ముంచుకొస్తుంది.
ఇకపోతే కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని జాగ్రత్తలు తెలుపుతూ సోషల్ మీడియాలో సెలెబ్రెటీలు చురుగ్గా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జాగ్రత్తలు తెలిపిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కరోనా పై జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.. అదే రచ్చ చేస్తున్నారు. ఇక అభిమానులు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్.. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది. అయితే ఈ లాక్ డౌన్ లో రాజమౌళి విశ్రాంతి తీసుకోవడం లేదని టాక్..
ఇప్పటివరకు అయినా చిత్రీకరణను దగ్గరుండి మరి ఎడిట్ చేయిస్తున్నారట. ఇకపోతే మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా విడుదల చేయనున్న వీడియో పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని చేస్తున్నారట. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను పూణేలో జరపనున్నారని సమాచారం.. వచ్చే ఏడాది జనవరి 8 న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు..