కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ.. ఈ సమయంలో సినీ హీరోయిన్ కారులో బయటకు రావడమే కాకుండా యాక్సిడెంట్ కు గురి కావడం చర్చనీయాంశం అవుతోంది. అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన కెవ్వుకేక సినిమాలో హీరోయిన్ గా నటించిన షర్మిల మాండ్రే కారు యాక్సిడెంట్ కు గురైంది. కారులో ఆమెతో పాటు తన ఫ్రెండ్ లోకేశ్ వసంత్ ఉన్నాడు.

 

 

ఈనెల 4న తెల్లవారుఝామున 3గంటల ప్రాంతంలో బెంగళూరులోని వసంత్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జి పిల్లర్ ను వీరు ఢీ కొట్టారు. ఈ యాక్సిడెంట్ లో షర్మిల మోహానికి గాయాలు కాగా, వసంత్ చేతికి గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలో ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లగా ఫస్ట్ ఎయిడ్ తీసుకుని వెళ్లిపోయారు. లాక్ డౌన్ సమయంలో వీరు బయటకు రావడంపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వారిపై సుమోటో కింద కేసు నమోదు చేశారు. కారును కూడా సీజ్ చేశారు. సరదా కోసమే వారు బయటకు వచ్చారని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.

 

 

కారుకు కర్ణాటక స్టేట్ పోలీస్ పాస్ కూడా ఉండటంతో దీనిపై విచారణ చేస్తున్నామని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. హాస్పిటల్ లో వీరిద్దరూ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతాన్ని జయానగర్ ప్రాంతంలో జరిగినట్టు చెప్పి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్ జరగడంతో కేసును బెంగళూరు పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: