గత కొన్ని రోజులుగా మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో పెళ్ళికి సిద్ధమవుతోందని, ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదనే ఓ వార్త మీడియాలో, సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారిన విషయం తెలిసిందే. సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో ఆమె అభినయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు కీర్తి. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం నేషనల్ మీడియాలో ఊపందుకొన్నది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కీర్తి సురేష్ చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో మంచి ఫార్మ్ లో ఉన్న కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఈ వార్తలు జోరుగా షికారు చేయడం వెనక ఓ నటుడు వున్నాడని తాజాగా బయట పడింది.
అతనో స్టార్ కమెడియన్. పేరు సతీష్ ముత్తుక్రిష్ణన్. కీర్తి సురేష్ త్వరలో ఓ బీజేపీ నాయకుడి తనయుడిని వివాహం చేసుకోబోతోందని, తన తండ్రి స్వయంగా కుదర్చిన సంబంధం ఇదని కీర్తి తనతో చెప్పిందని సతీష్ ముత్తు క్రిష్ణన్ మీడియాకు న్యూస్ని లీక్ చేశాడట. ఈ విషయం గురించి కీర్తిని అడిగితే వచ్చే ఏడాది వరకు తన డైరీ ఫుల్ అయిపోయిందని, ఈ సమయంలో తాను ఎలా వివాహం చేసుకుంటానని వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ఇన్ సైడ్ టాక్ మాత్రం మరోలా వున్నట్టు చెబుతున్నారు. తన పెళ్లి వార్తలు జోరుగా ప్రచారం కావడంతో కీర్తి దిద్దుబాటు చర్యలకు దిగిందని, దీని కారణం ఎక్కడ తన చేతి నుంచి పెద్ద సినిమాలు చేజారిపోతాయేమోనని ఆమె భయపడుతోందని తమిళ చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ కీర్తి తన వివాహం గురించి సతీష్ చెప్పిందా? లేక తానే కావాలని ఆ వార్తల్ని మీడియాకు లీక్ చేశాడా? అన్న విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది.