'పటాస్‌' నుంచి 'సరిలేరు నీకెవ్వరు' వరకూ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుల లిస్టులో తన పేరు చేరిపోయింది. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించడం ఈ డైరెక్టర్ స్టైల్. గ‌త ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఎఫ్‌2`. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రం గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌గా వంద కోట్లు వ‌సూలు చేసి ఔరా అనిపించింది. ఈ సినిమా ఎండింగ్‌లోనూ సీక్వెల్ ప్లాన్స్ వున్న‌ట్టు హింట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌స్తుతం అదే ప‌నిలో బిజీగా వున్నాడు.

 

త్వ‌ర‌లో సీక్వెల్ ని చేయ‌బోతున్నాన‌ని ఇటీవ‌ల `స‌రిలేరు నీకెవ్వ‌రు` స‌మ‌యంలో మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే ప‌నిలో వైజాగ్‌లో బిజీగా వున్నాడు. ఈ సీక్వెల్‌లో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌కు మాత్రమే జోటు క‌ల్పించిన అనిల్ రావిపూడి హీరోయిన్‌లు త‌మ‌న్నా, మెహ‌రీన్‌ల‌కు మాత్రం ఇందులో చోటు క‌ల్పించ‌డం లేద‌ట‌. వీరిద్ద‌రి స్థానంలో వేరే హీరోయిన్‌ల‌ని తీసుకోవాలని అనిల్ రావిపూడి భావిస్తున్నాడట. అంతేకాకుండా ఫ‌స్ట్ పార్ట్‌కి మించి మూవీని మ‌రింత గ్లామ‌ర‌స్‌గా రెడీ చేస్తున్నాడ‌ట‌. అందుకు కొత్త వాళ్లైతేనే బాగుంటుంద‌ని భావించాడ‌ట అనిల్ రావిపూడి. ఈ సీక్వెల్‌ని కూడా దిల్ రాజే నిర్మిస్తార‌ట‌. ప్రజెంట్ వెంకీ ‘నారప్ప’తో బిజీగా ఉండగా, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆగష్టు సమయానికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయట. దిల్ రాజు - అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ని ఆగష్టు నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: