అల వైకుంఠపురముతో ఇటీవల ప్రేక్షకులముందుకు వచ్చి ఏకంగా ఇండస్ట్రీ హిట్ నే ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 150కోట్ల వసూళ్లను రాబట్టి టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో సినిమాగా రికార్డు సృష్టించింది. ఈసినిమా తరువాత అల్లు అర్జున్ ,సుకుమార్ డైరెక్షన్ లో తన 20 వ చిత్రంలో నటించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో  తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని ,లారీ డ్రైవర్ పాత్రలో కొత్త లుక్ లో కనిపించనున్నాడు. 
 
జూన్ నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈనెల 8న బన్ని పుట్టిన రోజు సందర్భంగా  ఈసినిమా నుండి అప్డేట్ రానుందని  చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. అయితే ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ టైటిల్ ఎవరి ఊహలకు అందని విధంగా చాలా విచిత్రంగా వుండనుందని టాక్. బుధవారం 9 గంటలకు ఈ టైటిల్ రివీల్ కానుంది.
 
ఈ చిత్రంలో బన్ని సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటించనుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ,జగపతి బాబు ప్రతినాయకులు గా కనిపించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: