టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై ఫైటింగ్ చేసిన శ్రీ రెడ్డి.. మరోసారి అదే రేంజ్ లో కాంట్రవర్సీ చేయడానికి సిద్ధమవుతోందా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజులుగా అగ్రతారల జోలికి రాకుండా సైలెంట్ గా ఉండిపోయిన శ్రీరెడ్డి కొద్ది రోజుల క్రితం అమలా పాల్ రెండో వివాహంపై కామెంట్లు చేసింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా వణికిపోతుంటే శ్రీరెడ్డి మాత్రం హద్దులుదిటి హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
కరోనా నుంచి తప్పించుకోవాలంటే శృంగారంలో పాల్గొనడమే దీనికి మందు అంటూ కామెంట్ చేసి పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ వుందంటూ హడావిడి చేసి పట్టపగలు అర్థనగ్నంగా నిలుచుని జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచింది. ఆ తరువాత జనపేనా అధినేత, స్టార్ హీరో పవన్కల్యాణ్ని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగిన శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో దుమారం రేపాయి. అక్కడి నుంచి సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూనే వుంది.
తాజాగా మళ్లీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లపై హద్దులు దాటి కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. వల్గర్ లాంగ్వేజ్ని వాడుతూ స్టార్ హీరోయిన్లు సమంత, త్రిషలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సమంతా నిమ్మకాయలు, త్రిష ద్రాక్షలు నా ముందు ఎదుకు పనికిరావంటూ కామెంట్ చేసింది. గతేడాది సెప్టెంబరులోనూ సమంతాపై పోస్టు చేసింది శ్రీరెడ్డి. తన ఫొటోతో పాటు సమంతా ఫొటో పెట్టి ఇద్దరిలో ఎవరు హాట్ గా ఉన్నారని ప్రశ్నించింది. దాంతో పాటు త్రిష బాతింగ్ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆమె ఫ్యామస్ అయిందని, నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ పోజ్ చేస్తే త్రిషలో ఏముండదు. నేను హాట్ గా ఉంటా అని కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ చెప్పరాని మాటల్లో ఈ ఇద్దరు తారలపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. బాడీ షేమింగ్ కి మించి ఈ వ్యాఖ్యలు వుండటంతో నెటిజన్స్ శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా.. అంటూ మండిపడుతున్నారు.