శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మొదటి సినిమా డాలర్ డ్రీంస్ అంతగా ఎవరికి తెలియకపోయినప్పటికి ఆ తర్వాత వచ్చిన ఆనంద్ సినిమా మాత్రం దర్శకుడిగా మంచి ఫేం ని తీసుకువచ్చింది. ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్ సినిమాలు శేఖర్ కమ్ముల అంటే ఏంటో ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయో ఒక మార్క్ పడిపోయింది. ఇక టాలీవుడ్ ఫీల్ గుడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు శేఖర్ కమ్ముల. ఇక దిల్ రాజు బ్యానర్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి తన సత్తా ని చూపించారు. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

 

ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'లవ్‌స్టోరి'. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. దాంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు మొదలయ్యాయి. 

 

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి పాత్ర కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. సాయి పల్లవితో పోల్చి చూస్తే నాగచైతన్య పాత్రకు ప్రాధాన్యత కాస్త తక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. దాంతో ఎక్కువగా పేరు సాయి పల్లవికే వస్తుందన్న పుకార్లు బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సినిమా రిలీజయ్యో వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: