టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మూడేళ్ళ క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో హీరోగా రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ కొట్టి మరొక్కసారి మెగాస్టార్ స్టామినాని టాలీవుడ్ కి రుచి చూపించడం జరిగింది. అయితే దాని తరువాత వచ్చిన పీరియాడికల్ మూవీ సైరా నరసింహారెడ్డి మాత్రం ఆశించిన రేంజ్ లో ఫలితాన్ని మెగాస్టార్ కి అందివ్వలేదు. ఇక ప్రస్తుతం వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్, తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళి తన ఫ్యాన్స్ ని ఖుషి చేయాలని చూస్తున్నారు. 

 

ఒక మంచి మెసేజ్ తో పాటు పలు రకాల కమర్షియల్ అంశాలతో దర్శకుడు శివ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాని ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి. ఇకపోతే ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా సోషల్ మీడియా మాద్యమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, అప్పటి నుండి ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇకపోతే రేపు స్టైలిష్ స్టార్ బన్నీ పుట్టినరోజు కావడంతో నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్ లో పెట్టిన ఒక ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. 

 

తనకు, ఏప్రిల్ 8 తో ఎంతో మంచి అనుబంధం ఉందని, సశేషం, ఈ ట్వీట్ కంటిన్యూ అవుతుంది అంటూ మెగాస్టార్ పోస్ట్ చేసారు. అయితే ఆ ట్వీట్ ఆయన పోస్ట్ చేసిన వెంటనే, అది ఖచ్చితంగా బన్నీ బర్త్ డే కి సంబంధించింది అని, ఇప్పటికే బన్నీ, సుకుమార్ ల న్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు ఉదయం 9 గంటలకు వస్తుందని నిర్మాతలు ప్రకటించి ఉండడంతో, ఒకవేళ మెగాస్టార్ ఆ ఫస్ట్ లుక్ ని తన చేతులమీదుగా రిలీజ్ చేస్తున్నారా అంటూ పలువురు మెగా ఫ్యాన్స్ అప్పుడే పలువిధాలుగా ఆలోచనలు చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్న ఆ ట్వీట్, మెగాస్టార్ దేనిని ఉద్దేశించి పెట్టారో తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే మరి....!!

 

....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: