అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది.

 

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వం లో నటిస్తున్నారు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ హ్యాట్రిక్ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ లో కొంత టాకీ పార్ట్ ని కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ఒకటి ఏప్రిల్ 8 న ఉదయం 9 గంటలకి మేకర్స్ రిలీజ్ చేయనున్నారని ఒక పోస్టర్ ని వదిలి క్లారిటి ఇచ్చారు. ఈ పోస్టర్ లో ఉన్న దాన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ రాయలసీమ యాస లో మాట్లాడతారని అర్థమవుతుంది. 

 

ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ఎక్కువ భాగం శేషాచలం అడువుల నేపథ్యంలో సాగుతుందట. అయితే ఈసినిమాకి శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన్న గురించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరిలేరు సినిమాకి రష్మిక కాస్త మైనస్ అన్న టాక్ వచ్చినట్టే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి రష్మిక మైనస్ అవుతుందని మాట్లాడుకుంటున్నారట. మరి ఇలాంటి టాక్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుందన్నది మాత్రం క్లారిటి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: