నాపేరుసూర్య.. నా ఇల్లు ఇండియా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ తీసుకున్న బన్నీ.. మళ్లీ ఇప్పుడు కూడా అదే టైమ్ మెయింటెన్ చేస్తున్నాడు. బన్నీ మళ్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతే కనిపించబోతున్నాడు లేటెస్ట్ గా సుకుమార్ తో చెయ్యబోయే సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశాడు బన్నీ.
అల్లు అర్జున్.. 2018 లో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియాసినిమా రిలీజ్ చేశాడు. ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో కాస్త టైమ్ తీసుకుని అలవైకుంఠపురంలో సినిమా చేశాడు. త్రివిక్రమ్ తో చేసిన ఈ సినిమా 2020 జనవరిలో రిలీజ్ అయ్యింది. నాపేరు సూర్య సినిమా తర్వాత సంవత్సరన్నర కి గానీ తన నెక్ట్స్ సినిమా రిలీజ్ చెయ్యలేదు బన్నీ. తన నెక్ట్స్ సినిమాకి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైమ్ తీసుకుంటున్నాడు.
బన్నీకి అలవైకుంఠపురం అదిరిపోయే సక్సెస్ ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్న బన్నీ ఇప్పడు సుకుమార్ తో ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ రివేంజ్ డ్రామాలో బన్నీ డిఫరెంట్ డిఫరెట్ లుక్స్ లో కనిపించబోతున్నాడు. ఆల్రెడీ వీళ్ల కాంబినేషన్ మీద అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఆ నెల 8న ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ బయటకు రానుంది.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా కంటిన్యూయస్ గా కేరళలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాకోసం ఎక్కువే కాల్షీట్స్ తీసుకున్నాడు సుకుమార్. ఎంత చేసినా ఈ ఇయర్ ఎండ్ వరకూ.. మహా అయితే సంక్రాంతి వరకూ రిలీజ్ చేసేస్తాడు అనుకున్నారు అందరూ. కానీ ..ఈ సినిమా ఇప్పుడు ఏకంగా నెక్ట్స్ ఇయర్ సమ్మర్ కి వెళ్లిపోయింది. సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే కనక బన్నీ .. మళ్లీ సంవత్సరంన్నర తర్వాతే ప్రేక్షకుల ముందుకు వచ్చేది. బన్నీకి జోడిగా రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.