సలామ్ రాఖీ భాయ్ అంటూ శత్రువుల చేత కూడా గులామ్ గిరీ చేయించుకున్న హీరో.. అదే శత్రువుకి సరెండర్ అయిపోతాడా..? 100 మందిని ఒక్క చేత్తో మట్టికరిపించిన రాఖీ భాయ్ విలన్ల చేతిలో చనిపోతాడా..? సినిమా మేకింగ్ కన్నా.. రాఖీ భాయ్ హీరోయిజానికి ఫిదా అయిన ఫ్యాన్స్ ఈ సారి డిసప్పాయింట్ అవ్వాల్సిందేనా..?

 

ప్రజెంట్ తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమాల్లో వన్ ఆఫ్ ద క్యూరియస్ మూవీ కెజిఎఫ్ 2. షూటింగ్ టైమ్ లో ఉన్న ప్రతి సినిమా గురించి ఏదోక ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. కానీ షూట్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి అసలు ఎలాంటి క్లూ లేకుండా కామ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ కేజీఎఫ్‌ 2 గురించి షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.

 

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఆ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కి ఇప్పుడు అంతే స్ట్రాంగ్ గా కేజీఎఫ్‌ 2  రాబోతోంది. ఈ సినిమా లో హీరో యష్ కి ధీటుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. కేజీఎఫ్‌ 2 లో హీరోకి ఎంత స్పేస్ ఉంటుందో ..విలన్ కి కూడా అదేరేంజ్ లో స్టేచర్ ని , స్పేస్ , ఇంపార్టెన్స్ ఇస్తున్నారు . ఈ సినిమాలో అధీరా గా సంజయ్ తో పాటు మరో నెగెటివ్ క్యారెక్టర్ లో బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ నటిస్తోంది.

 

ఫస్ట్ పార్ట్ లో చూపించినట్టే సెకండ్ పార్ట్ లో.. కూడా యష్ ని తప్పించడానికి చాలా మంది విలన్లు ఉన్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 లో షాకింగ్ క్లైమాక్స్ సెట్ చేసిందట టీమ్. ఇప్పటి వరకూ ఎంతో కష్టపడి రాఖీభాయ్ నిలబెట్టిన సామ్రాజ్యాన్ని దక్కించుకోవడానికి విలన్లు ట్రై చేసే క్రమంలో రాఖీభాయ్.. చనిపోతాడన్న టాక్ వినిపిస్తోంది. చనిపోయినా.. అదే రాజసంతో అమ్మమాట నిలబెట్టుకున్నాడన్న స్ట్రాంగ్ మెసేజ్ తో సినిమా ఎండ్ చేస్తున్నాడని న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: