త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలను ఎంతపొదుపుగా వాడుతాడో తన సినిమా బడ్జెట్ విషయంలో అదేవిధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఖర్చు విషయంలో చాల జాగ్రత్తగా ఉంటాడు అన్నకామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం త్రివిక్రమ్ ఎప్పుడో మహేష్ తో చేయవలసిన సినిమా కోసం తీసుకున్న 2కోట్ల అడ్వాన్స్ ఇప్పుడు త్రివిక్రమ్ కు సమస్యగా మారి 11కోట్ల వరకు పోగొట్టుకున్నట్లుగా వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.


త్రివిక్రమ్ మైత్రీ మూవీస్ సంస్థకు మహేష్ తో ఒక సినిమా తీస్తానని చాల సంవత్సరాల క్రితం 2కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడట. అయితే ఆతరువాత మహేష్ త్రివిక్రమ్ ల మధ్య ఏర్పడిన బయటపడని గ్యాప్ తో ఆమూవీ పట్టాలు ఎక్కలేదు. ఆతరువాత త్రివిక్రమ్ బయట నిర్మాణ సంస్థలతో సినిమాలు చేయడం పూర్తిగా మానివేసి కేవలం తమ సొంత నిర్మాణ సంస్థగా అనిపించుకుంటున్న హారికా హాసినీ సంస్థకు మాత్రమే గత రెండు సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నాడు. ఎన్నిసార్లు మైత్రీ మూవీస్ రాయబారాలు చేసినా త్రివిక్రమ్ ఆసంస్థకు చేయవలసిన సినిమా పై స్పందించలేదని తెలుస్తోంది. 


దీనితో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు ఈవ్యవహారాన్ని ఇండస్ట్రీ పెద్దల వరకు తీసుకువెళ్ళడంతో ప్రస్తుతం కరోనా తో ఖాళీగా ఉన్న ఇండస్ట్రీ పెద్దలు ఈవ్యవహారాన్ని సెటిల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో మైత్రీ సంస్థ త్రివిక్రమ్ కు ఇచ్చిన భారీ అడ్వాన్స్ వడ్డీలు అన్నీ కలుపుకుని దాదాపు ఎనిమిది కోట్ల వరకు అవ్వడంతో అడ్వాన్స్ కు రీజనబుల్ వడ్డీకట్టి ఆమొత్తాన్ని త్రివిక్రమ్ తిరిగి మైత్రీ మూవీస్ కు ఇచ్చే విధంగా ఒప్పందం మాటలు వినిపిస్తున్నాయి. 


దీనితో త్రివిక్రమ్ కు ఈ కరోనా సమయంలో భారీ మొత్తాన్ని మైత్రీ మూవీస్ కు చెల్లించుకోవలసి వచ్చిందని ఈ సెటిల్మెంట్ ప్రకారం కొంత మొత్తం త్రివిక్రమ్ చెల్లించి మరికొంత మొత్తానికి టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు గాసిప్పులు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ఈవార్తలు ఇలా వైరల్ కావడంతో కొంతమంది ఈవార్తలు విని ఆశ్చర్యపడుతుంటే మరికొందరు మాత్రం ఇది అంతా త్రివిక్రమ్ వ్యక్తిగత ప్రతిష్ఠ పై బురద జల్లడానికి కొందరు చేస్తున్న నెగిటివ్ వార్తలు అంటూ పక్కకు నెట్టేస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: