దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రాజమౌళి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాడని సమాచారం. మోహన్ లాల్ కూడా ఆ ప్రత్యేక పాత్రలో నటించడానికి అంగీకరించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
అయితే ఈ చిత్రంలో మోహన్ లాల్, ఎన్టీఆర్ కి బాబాయ్ పాత్రలో నటించబోతున్నాడట. ఎందుకంటే కొమరం భీమ్ జీవితంలో ఆయన బాబాయి పాత్ర చాల కీలకం అని తెలిసింది. భీమ్ లో పోరాట తత్వాన్ని చిన్నప్పుడే ‘బీమ్ బాబాయ్’ బీమ్ కు నూరిపోశాడట. మరి ఇలాంటి పాత్రలో వీరిద్దరూ చాలా కరెక్ట్గా సూట్ అవుతారని చెప్పాలి. ఇక వీరిద్దరూ కలిసి గతంలో కూడా జనతాగ్యారేజ్లో నటించారు. అందులో ఎన్టీఆర్కి మావయ్యగా నటించిన మోమన్లాల్ ఈ చిత్రంలో బాబాయ్గా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన, అలాగే ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అలాగే ఇతర కీలక పాత్రల కోసం విదేశీ నటీనటుల్ని ఐర్లాండ్కు చెందిన నటుడు రే స్టీవెన్ సన్ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. మరో ప్రత్యేక పాత్రలో అజేయ్ దేవగన్ నటిస్తున్నాడు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేది కరోనా వైరస్ నేపథ్యంలో కాస్త సమయం పట్టేట్టు ఉంది.