సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అందరికి చాలా ఇష్టం... తాను చేసే యాక్టింగ్ తో అందరిని అక్కటుకుంటాడు. అది ఏ భాషలోనైనా తనకంటూ మంచి ప్రత్యేక ఏర్పరచుకుంటారు. ప్రస్తుతం రజినీకాంత్ ‘అన్నాత్త’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లో ముఖ్యపాత్రల్లో పాత్ర పోషిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్న కూడా ఇటీవల రియాలిటీ షో చేయడం మొదలు పెట్టారు.
సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటకీ కూడా రజనీకాంత్ తాజాగా బేర్ గ్రిల్స్ తో కలిసి చేసిన ఒక రియాలిటీ షో సూపర్ హిట్ అయింది. రియాలిటీ షో వివరాల విషయానికి వస్తే రజనీకాంత్ బేర్ గ్రిల్స్ తో కలిసి ‘ఇన్ టూది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్’ అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ రియాలిటీ షో డిస్కవరి చానెల్ లో 12 భాషల్లో ప్రసారం అవ్వడం జరిగింది. ఈ షో మార్చి నెల 23 న రాత్రి 8 గంటలకు డిస్కవరి చానెల్ లో ప్రారంభం అయ్యింది.
ఈ రియాలిటీ షో ఈ సంవత్సరంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా నిలిచింది ఆంటే నమ్మండి. అంతే కాకుండా అత్యధిక రేటింగ్ లభించిన రియాలిటీ షోగా రికార్డు బద్దలు కొట్టింది. ఈ షోకి సంబంధించి కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ సమయంలో రజినీకాంత్ కు గాయాలు అవ్వడం జరిగింది.
ఈ రియాలిటీ షోని తమిళనాడులో ఎక్కువ మంది వీక్షించారు అని అర్థం అవుతుంది. ఇక బార్క్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 12.4 మిలియన్ల మంది చూసారు అని తెలిపింది. ఈ షో వచ్చిన అన్ని రోజులు అన్ని ఛానెల్స్ లోని హిట్ సీరియల్స్ ఆదరణ బాగా తగ్గిపోయింది ఆంటే నమ్మండి. మొత్తానికి మంచి రికార్డులతో విజయం సాధించింది అనే చెప్పాలి.