ఈ మద్య వరుసగా బాలీవుడ్ మూవీస్ తెలుగులో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన ‘అంధదూన్' మూవీ తెలుగు లో రిమేక్ చేయబోతున్నారు. ఇందులో నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం మేర్లపాక గాంధీ వహిస్తున్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి ఎన్, నికిత రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. హిందీ సినిమాలో 'టబు' చాలా కీలకమైన పాత్రను పోషించింది. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నటుగా వార్తలు వచ్చాయి.
ఆ మద్య ఈ పాత్ర కోసం హాట్ బ్యూటీ యాంకర్ అనసూయను తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో హిట్ కొట్టాలనే నితిన్ కోరిక, 'భీష్మ' సినిమాతో నెరవేరింది. వెంకి కుడుముల దర్శకత్వంలో కలర్ ఫుల్ లవ్ స్టోరీగా నిర్మితమైన ఈ సినిమాకి యూత్ నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఇదే ఊపులో నితిన్ అంధదూన్ మూవీ రిమేక్ కి సిద్దమయ్యారు.. సొంత బ్యానర్లోనే ఆయన ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ .. 'రంగ్ దే'.. 'చెక్' సినిమాలు చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతనే, ఆయన 'అంధదూన్' రీమేక్ షూటింగులో పాల్గొననున్నాడు. ఈ మూవీలో అత్యంత కీలకమైన పాత్ర అదే కావడంతో, ఆ పాత్రకి రమ్యకృష్ణ అయితేనే బాగుంటుందని భావించి ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే హిందీలో టబు చేసిన పాత్ర నెగెటివ్ షేడ్స్ తో ఉంటుంది. గతంలో రమ్యకృష్ణ ఈ తరహా పాత్రలో నటించింది.. అందుకే ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం.