రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20 వ చిత్రం అప్డేట్ గురించి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అయినా కూడా ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కనీసం టైటిలో లేదా ఫస్ట్ లుక్ ను వదిలినా ఫ్యాన్స్ పండగ చేసుకొనేవారు కానీ వస్తుంది .. వస్తుంది అని వూరించడం తప్ప ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేకపోతున్నారు దాంతో నిన్న ట్విట్టర్ లో బ్యాన్ యువీ క్రియేషన్స్ అనే హాష్ ట్యాగ్ ట్రేండింగ్ లో కొనసాగింది. ప్రభాస్ ఫ్యాన్స్ దీనికి భారీగా మద్దతు తెలిపారు. ఇక ఆ ట్రోలింగ్ పై స్పందించింది యువీ క్రియేషన్స్. ప్రస్తుతం కరోనా వల్ల సినిమాకు సంబంధించిన పనులను వాయిదా వేసాం. ఈ విపత్కర పరిస్థితులనుండి బయటపడ్డాక చాలా అప్ డేట్స్ ఇస్తామని ఫ్యాన్స్ ను కూల్ చేసింది. 
 
 జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రైజింగ్ హీరోయిన్  పూజా హెగ్డే ప్రభాస్ కు జోడిగా నటిస్తుండగా  కృష్ణం రాజు , భాగ్య శ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతెలుగు తోపాటు తమిళ , హిందీ భాషల్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: