టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కాంట్రవర్సీ ఏక్కడుంటే దాన్ని వెతుక్కొని మరీ వెళ్తారు.. అదే ఆయన పాపులారిటీకి బలం అని నమ్ముతారు.  అవును అతా నా ఇష్టం.. నాకు నచ్చిందే చేస్తాను.. నాకు నచ్చినట్లు ఉంటారు అంటారు.   ప్రస్తుతం తెలంగాణలో ఆ మద్య వెటర్నరీ డాక్టర్ దిశ ను నలుగురు కామాంధులు తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంతో ఓ మూవీ తీస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్ తో మంచి పాపులారిటీ సంపాదించి ‘అష్టాచమ్మ’ మూవీతో హీరోయిన్ గా మారిన కలర్స్ స్వాతి ప్రస్తుతం తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

 

తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు సినిమాల్లో నటించిన కలర్స్ స్వాతి వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. వర్మ దర్శకత్వంలో 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' సినిమాలోను ఆమె నటించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె వర్మ గురించి ప్రస్తావించింది. వర్మ దర్శకత్వంలో నేను ఈ సినిమా చేసిన తరువాత, ఆయన గురించి అంతా నన్ను అడగడం మొదలుపెట్టారు.

 

ఆయన గురించి ఎంతో మంది ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు.. కానీ నాకు తెలిసి వర్మ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అవసరానికి మించి నాతో ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 'స్వాతి నువ్ చాలా టాలెంటెడ్ .. నిన్ను చూస్తుంటే నాకు రేవతి గుర్తొస్తుంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు.. అది అంత మంచిది కాదని సలహాలు ఇచ్చేవారని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: