భారతదేశం ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న నేపథ్యంలో... పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా తమ వంతు సహాయం చేస్తున్నారు. చాలా మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా లక్షల డబ్బులను దానం చేస్తుండగా... మరికొంతమంది మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ తమకు దగ్గరలోని పేదవారిని ఆదుకుంటున్నారు. సీఎం, పిఎమ్ రిలీఫ్ ఫండ్ లకు లక్షల, కోట్ల రూపాయలు ఇచ్చినా అవి పేద ప్రజలకు అందేలోపు చాలా సమయం పడుతుంది. దాంతో మన ప్రయత్నం, డబ్బు మొత్తం వృధా అవుతుంది. అందుకే మన స్థానిక ప్రాంతాల్లో కూడు కుమ్ము లేక ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారం అందించడం, నిత్యావసర సరుకులను సరఫరా చేయడం ఓ తెలివైన ఆలోచన చాలా మంది భావిస్తున్నారు. తాజాగా ఈ కోవలోకే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి కూడా వచ్చారు.


ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన టాలీవుడ్ రచయితగా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు రాష్ట్రాలలో బాగా క్రేజీ ని సంపాదించారు. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా రాణిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నిజాయితీగా ఉంటూ మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోకుండా అందరిని ప్రేమతో చూసుకునే పోసాని కృష్ణ మురళిని ద్వేషించే వారు కూడా ఎవరూ ఉండరు.


వర్తమాన విషయానికొస్తే... లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక, చేతిలో కూడా డబ్బులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 50 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పోసాని కృష్ణ మురళి ఉచితంగా అందించారు. దాంతో ఆ 50 కుటుంబాలు పోసాని కృష్ణ మురళికి ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనా ప్రజలకు డబ్బులు ఇస్తానని బొంకు మాటలు చెప్పే దిక్కుమాలిన, పనికిమాలిన నేతల కంటే పేదవారి ఇంటికి వెళ్లి వారికి నిత్యావసర సరుకులను అందించే పోసాని కృష్ణ మురళి లాంటి మంచి దాతృత్వం కలిగినవారు ఈ దేశానికి ఎంతో అవసరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: