ఎక్కడ చూసిన వినపడే ఒకే ఒక్క మాట కరోనా ... కరోనా ప్రభావం నియంత్రణ లో ఎన్ని చర్యలు చేపట్టిన కూడా తన వికృత రూపాన్ని చూపిస్తూ వస్తుంది. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా  కరోనా ప్రభావం ఆత్రం మరింత పెరుగుతూ వస్తుంది.. ఈ మేరకు ప్రజలు ఇళ్ల నుంచి బయట కు రాకుండా స్వవెయ నిర్బందంలో ఉన్న కూడా దాని బారిన పది చాలా మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు.ఇప్పటికే చాలా కేసులు నమోదు అవుతున్నాయి కూడా..  

 

 

ఇప్పటికే  ప్రపంచాన్ని కదిలించి వేసిన ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రజల ను అను క్షణం భయ పడేలా చేస్తుంది. అంతే కాక దేశ వ్యాప్తం గా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను  చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది.. 

 

 


కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సినీ నటులు సోషల్ మీడియాను వేదికగా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు. తాజాగా సినీ నటి మాధవీలత ఒక టిక్ టాక్ వీడియో ను  అభిమానులతో  పంచుకుంది. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.

 

 


అలాగే .. ‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’అంటూ పవర్ కవితను చెప్పింది.ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఆ వీడియో సోషల్  మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: