యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా పూర్తి కాగానే నెక్స్ట్ త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తామని తెలిసిందే. హారిక హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబండినించిన లేటెస్ట్ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్నా ఈ మూవీలో మళయాళ స్టార్ మోహన్ లాల్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారని తెలుస్తుంది.

 

ఆల్రెడీ కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి నటించారు. మరోసారి ఈ ఇద్దరు త్రివిక్రమ్ డైరక్షన్ లో కలిసి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో మోహన్ లాల్ నటిస్తారని టాక్. అయితే ఈ పాత్రకు మోహన్ లాల్ బదులుగా నందమూరి నటసింహం బాలకృష్ణను పెడితే బాగుటుందని కొందరు ఆలోచన. ఎన్టీఆర్, బాలయ్య ఇద్దరు ఒకే సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. 

 

అయితే బాలయ్య, ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేస్తే ఇద్దరిది సమానమైన రోల్స్ ఉండేలా చూసుకోవాలి. కానీ త్రివిక్రమ్ సినిమాలో మోహన్ లాల్ బాబాయ్ పాత్రలో కనిపిస్తాడట. అంటే అతని పాత్ర హీరో పాత్ర కన్నా వెయిట్ తక్కువ ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. మరి అలాంటి పాత్ర బాలకృష్ణ చేయడు కాబట్టి మోహన్ లాల్ ను ఎంపిక చేశారట. జనతా గ్యారేజ్ లో ఈ ఇద్దరు చేసిన మ్యాజిక్ మరోసారి రిపీట్ చేస్తారని తెలుస్తుంది. 

 

అల వైకుంఠపురములో సక్సెస్ తో తన సత్తా చాటిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఆల్రెడీ అరవింద సమేత హిట్ అందుకున్నాడు. ఇద్దరు కలిసి చేస్తున్న ఈ రెండో మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ మూవీకి అయిననూ పోయి రావాలె హస్తినకు టైటిల్ ప్రచారంలో ఉంది. తప్పకుండా తారక్ తో త్రివిక్రమ్ మరో అద్భుతాన్ని చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రియులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: