మెగా ఫ్యామిలీ హీరోల నుంచి ఏ సినిమా అప్డేట్ వచ్చినా అభిమానులకు పండగే. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ల సినిమాలు అయితే చెప్పే పని లేదు. వీరి సినిమాలకు మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ట్రేడ్ సర్కిల్ లో బిజినెల్స్ లెక్కలు మారిపోతూంటాయి. ప్రస్తుతం అలాంటి న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో 27వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. పవన్ కల్యాణ్ సినిమా అంటేనే ఓ సెన్సేషన్. అటువంటిది రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరుస్తున్నాడంటే అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పటి నుంచో మెగా హీరోలు కలిసి నటించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ తో అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

 

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వార్తపై అఫిషియల్ క్లారిటీ రానప్పటికీ ఈ వార్త మాత్రం హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొంతమేర జరిగింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక జరిగే షూటింగ్ లో చరణ్ ఎంటర్ అవుతాడని అంటున్నారు. దీనికంటే ముందు పవన్ నటించిన వకీల్ సాబ్ లో నటిస్తున్నాడు. పవన్ కల్యాణ్.. రామ్ చరణ్ ల మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ వార్తలపై నిజమెంతుందో తెలియాల్సి ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: