తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేశ్. మహానటి సినిమాతో జాతీయస్థాయి కీర్తి దక్కించుకోవటమే కాదు ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా అవార్దు కూడా సాధించింది. నటనలో ఆమె పర్ఫెక్షన్ కు మహానటి గీటురాయిగా నిలిచిపోయింది. ప్రస్తుతం తెలుగులో బడా ఆఫర్లు ఆమెకు దక్కుతున్నట్టు వార్తలు రౌండ్ అవుతున్నాయి. కీర్తి గురించి ఇది కాక మరో ఆసక్తికరమైన వార్త రౌండ్ అవుతోంది. నితిన్ హీరోగా కొత్త ప్రాజెక్టు తెరకెక్కబోతోందని సమాచారం.

 

 

ఈ సినిమాలో కీర్తి సురేశ్ ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను ఏలూరుకు చెందిన అమ్మాయిగా డిజైన్ చేశారట. భాష కూడా గోదావరి యాసలో ఉంటుందని అంటున్నారు. గతంలోనే ఈ సినిమా స్టోరీని కీర్తి సురేశ్ కి వినిపించారని అంటున్నారు. అయితే కీర్తి నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. కీర్తి అయితే సినిమాకు ఫిట్ అవుతుందని హీరో నితిన్ కూడా భావిస్తున్నాడట. ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడని అంటున్నారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక ఈ వార్తలపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.

 

 

మహేశ్ కొత్త సినిమాలో కీర్తినే ఫైనల్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నితిన్ సినిమా కూడా లైన్ లో పెట్టి రెండు సినిమాలు ఓకే చేస్తే కీర్తి తెలుగులో బిజీ అయినట్టే. మహానటితో ఆమె చేసే సినిమాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఆచితూచి సినిమాలు చేస్తోందని సమాచారం. నితిన్ సినిమాలో కీర్తి హీరోయిన్ అనే వార్తపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం నితిన్-కీర్తి రంగ్ దే సినిమాలో కలిసి నటిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: