ఏ ముహూర్తాన ఈ మహమ్మారి కరోనా, మన ప్రపంచం పై తన కోరలు చాస్తూ విరుచుకుపడిందో, ఆ క్షణం నుండి యావత్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు మొదలయింది. అయితే ఈ మహమ్మారిని వేగవంతంగా తరిమి కొట్టాలంటే, ఎక్కడి ప్రజలను అక్కడే తమ తమ ఇళ్లలోనే పూర్తిగా ఉండేలా పరిమితం చేస్తూ మన దేశం సహా పలు దేశాలు కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించడం జరిగింది. మన దేశంలో ఈ నెల 14తో లాకౌట్ ముగుస్తుందని మనవాళ్ళు భావిస్తున్నప్పటికీ, ఆ రోజు తరువాత నుండి మరొక రెండు వారాలు కొనసాగుతుంది అంటూ వార్తలు ఇప్పటికే ప్రచారం అవుతున్నాయి. ఇక ఆ విషయం అటుంచితే, దాని వలన ఓవైపు సినిమా థియేటర్స్ తో పాటు పలు సినిమాల షూటింగ్స్ కూడా పూర్తిగా రద్దు కావడంతో ఎక్కడి తారలు అక్కడే తమ తమ ఇళ్లకే అంకితం అవ్వడం జరిగింది. 
 
 
ఇక ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇటీవల ఉగాది పండుగ రోజున చేయాల్సి ఉన్నప్పటికీ, సడన్ గా లాకౌట్ రావడంతో సినిమా యూనిట్ దానిని వాయిదా వేయడం జరిగినట్లు తెలుస్తోంది. 
 
 
అయితే నిన్నటి నుండి ఈ విషయమై పలువురు ప్రభాస్ అభిమానులు, నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ విషయం నిర్మాతలవరకు చేరడంతో, బాబ్బాబు ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోయిన పరిస్థితి మీకు తెలుసుకదా, దయ చేసి కొంచెం ఓపిక పట్టండి, అతి త్వరలో ఈ లాకౌట్ ముగియగానే తప్పకుండా మీరు ఊహించుకున్న రేంజ్ కు మించేలా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తాం అంటూ ఎంతో వినమ్రంగా సమాధానం చెప్తూ వారు ఒక ట్వీట్ పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం వారు పెట్టిన ఆ ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!! 
 

మరింత సమాచారం తెలుసుకోండి: