ప్రస్తుతం కరోనా వల్ల ఇండియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడి కరోనా పై పోరుకు సెలబ్రెటీల తో పాటు పారిశ్రామిక వేత్తలు, సామాన్యులు కూడా విరాళాలను ఇస్తున్నారు. సినీ సెలబ్రెటీల్లో ఇప్పటి వరకు స్టార్ హీరో అక్షయ్ కుమార్ అత్యధిక విరాళం ఇచ్చిన హీరో కావడం విశేషం. అక్షయ్ ఏకంగా 25కోట్ల విరాళం ఇచ్చాడు.
 
అయితే ఇటీవల బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 250 కోట్లను పీఎం కేర్స్ ఫండ్ కు విరాళం ఇచ్చినట్లుగా సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేల్చడానికి ఎంతో సమయం పట్టలేదు. ఇక  ఎట్టకేలకు అమీర్ ఖాన్ విరాళం ఇచ్చాడు కానీ ఎంత ఇచ్చాడో మాత్రం బయటికి చెప్పలేదు.  పీఎం కేర్స్ ఫండ్ తోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయక నిధికి విరాళం ఇచ్చిన అమీర్ ఖాన్.. తను నటిస్తున్న కొత్త సినిమా లాల్ సింగ్ చద్దా కు పనిచేస్తున్న సినీ కార్మికులకు కూడా అండగా ఉండడానికి కొంత మొత్తాన్ని విరాళం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
 
ఇక ఇదిలావుంటే హాలీవుడ్ లో విజయం సాధించిన 'ఫారెస్ట్ గంప్' అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది లాల్ సింగ్ చద్దా. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కొత్త లుక్ లో కనిపించనుండగా ఆయనకు జోడిగా కరీనా కపూర్ నటిస్తుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి  అమీర్ కు ఫ్రెండ్ గా కనిపించనున్నాడట. సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: