మళయాళ భామ కీర్తి సురేష్ ఒక బిజెపి నేత తనయుడు బిజినెస్ మెన్ తో పెళ్ళికి సిద్ధమయ్యిందన్న వార్త గత వారం రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి. బిజినెస్ మెన్ ను బుట్టలో వేసుకుంది అంటూ కీర్తి సురేష్ పై వార్తలు బాగా వైరల్ గా మారాయి. అయితే ఈ వార్తలు రాడానికి కారణం ఒక కమెడియన్ ఉన్నాడని తెలుస్తుంది. తమిళ స్టార్ కమెడియన్ సతీష్ ముత్తు కృష్ణన్ ఈ వార్తల వెనుక ఉన్నాడని తెలుస్తుంది. 

 

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇతనే కీర్తి సురేష్ పెళ్లి ఫిక్స్ అయ్యిందని.. బిజినెస్ మెన్ తో కీర్తి సురేష్ పెళ్లి జరుగనున్నది చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని కీర్తి సురేషే తనకు చెప్పిందని అన్నాడు. అయితే కీర్తి సురేష్ మాత్రం మరో ఏడాది దాకా సినిమాలతో బిజీగా ఉన్నానని.. అసలు పెళ్లి చేసుకునేంత ఖాళీ టైం లేదని చెప్పింది. కెరియర్ పీక్స్ లో ఉన్న ఇలాంటి టైం లో పెళ్లి వార్తలు వస్తే స్టార్ సినిమాల అవకాశాలు తగ్గుతాయని కీర్తి సురేష్ అలా కవర్ చేసిందట. 

 

అయితే అసలు విషయం ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత కీర్తి సురేష్ బిజినెస్ మెన్ ను పెళ్లాడటం కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. మరి సతీష్ ముత్తుకృష్ణన్ చెబుతున్న వార్తలను బట్టి చూస్తుంటే పెళ్లి ఫిక్స్ అయినా సినిమా ఛాన్సులు పోతాయన్న కారణంతోనే కీర్తి సురేష్ తన పెళ్లి గురించి దాచేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తెలుగు, తమిళ భాషల్లో అతి తక్కువ కాలంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు కీర్తి సురేష్. ఆమెకు అప్పుడే పెళ్లంటే ఆమె ఫ్యాన్స్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. 

 

మహానటిని మరిన్ని సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. అటు మలయాళంలో కూడా ఆమె ఇంకా కెరియర్ కొనసాగించాలని అక్కడ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి కీర్తి సురేష్ నిజంగానే పెళ్ళికి ఫిక్స్ అయితే తన ఫ్యాన్స్ కు అన్యాయం చేసినట్టే అవుతుంది. అయినా ఏమంత వయసు అయ్యిందని అమ్మడు అప్పుడే పెళ్ళికి తొందరపడుతుందని అంటున్నారు కొందరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: