ఒక లైలా కోసం, ముకుంద వంటి చిత్రాలలో నటించి ఫ్లాపులు మూటగట్టుకున్న భామ పూజా హెగ్డే కొద్ది రోజుల్లోనే సూపర్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం స్టార్ హీరో సరసన పూజా హెగ్డే ఏకైక చాయిస్ గా మారింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ విజయలాతో దూసుకుపోతుంది. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రంలో నటిస్తుంది.

 

ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే హీరోయిన్లన్నాక పుకార్లు రావడం చాలా సహజం. అది బాలీవుడ్ హీరోయిన్ల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పాగా వేస్తుంది. అందుకేనేమో ఆమెపై కూడా పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు పూజా కి సంబంధించి ఎలాంటి పుకార్లు రాలేదు. కానీ ప్రస్తుతం పుకార్ల దాడి ఆమెపై కూడా పడింది. బాలీవుడ్ నటుడితో ఎఫైర్ ఉందంటూ గత కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి.

 

బాలీవుడ్ నటుడు వినోద్ మెహ్రా కొడుకు రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉందని, వారిద్దరు క్లోజ్ ఉన్న ఫోటోలు సోషల్ మిడియాలో ప్రత్యక్షమయ్యాయి. దాంతో బాలీవుడ్ మీడియా వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని.. అందుకే అంత క్లోజ్ గా ఉన్నారంటూ కోడై కూసింది. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన పూజా తను ఎవరినీ ప్రేమించట్లేదనీ.. రోహన్ తన మంచి ఫ్రెండే కానీ, బోయ్ ఫ్రెండ్ కాదనీ..ఏమీ తెలియకుండా ఇలాంటి రాతలు రాయవద్దని కోరింది. మొదట్లో మా మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప ఏమీ లేదని చెప్పిన వారే ప్రేమలో పడతారని.. పూజా కూడా అలాగే దాస్తుందని సొషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: