పటాస్ సినిమాతో దర్శకుడిగా మారిన అనిల్ రావిపూడి వరుస హిట్లతో జోరు మీదుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన ఐదు సినిమాలు ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి. కేవలం ఐదో సినిమాకే సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా మహేష్ బాబు కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సూపర్ ఫామ్ లో ఉన్న అజిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు.

 

ఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఆ సినిమాకి సీక్వెల్ చేద్దామని డిసైడ్ అయిన అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడట. భార్యా భర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ నుండి కామెడీ పుట్టించిన అనిల్ ఎఫ్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన నమ్మకంతోనే వెంకటేష్ వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎఫ్ 3 సినిమాలో హీరోలు ఎవరు నటిస్తారనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

 

ఎఫ్ 2 లో చేసిన వెంకీ, వరుణ్ లనే రిపీట్ చేయనున్నాడట. ప్రస్తుతం వారిద్దరూ తమ తమ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. వెంకటేష్ నారప్పగా, వరుణ్ తేజ్ బాక్సర్ గా చేస్తున్న రెండు సినిమాలు పూర్తయ్యాకనే షూటింగ్ మొదలెడతాడట. హీరోలు సరే మరి హీరోయిన్లని కూడా వారినే తీసుకుంటారా అంటే కాదని తెలుస్తుంది. ఎఫ్ 2 లో నటించిన తమన్నా, మెహ్రీన్ కౌర్ లని కాదని వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని అనుకుంటున్నాడట.

 


ప్రస్తుతం ఫామ్ లో ఉన్న వారిని తీసుకుని సినిమాకి మరింత మైలేజి తీసుకువస్తాడట. అయితే ఎఫ్ ౩ లో ముగ్గురు హీరోలు ఉంటారని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఆ మూడో హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: