మళయాళ భామ కీర్తి సురేష్ తెలుగు, తమిళ భాషల్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మహానటి సినిమాతో ఆమె నటనకు నేషనల్ అవార్డు సైతం వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు బాలీవుడ్ ఛాన్సులు వచ్చిన ఆ సినిమాలకు ముందు ఓకే చెప్పిన ఈ అమ్మడు ఆ తర్వాత కథలు నచ్చక సారీ చెప్పేసింది. ఇదిలాఉంటే ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియాతో పాటుగా నితిన్ సరసన రంగ్ దే సినిమా చేస్తుంది కీర్తి సురేష్. 

 

లవర్ బోయ్ నితిన్ తో కీర్తి సురేష్ చేస్తున్న రంగ్ దే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈమధ్యనే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కీర్తి సురేష్ మరోసారి యువత హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో నితిన్, కీర్తి సురేష్ ల రొమాన్స్ కూడా అదిరిపోతోందట. ఇక ఈ సినిమా తర్వాత కృష్ణ చైతన్య డైరక్షన్ లో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. పవర్ పేట టైటిల్ తో తెరకెక్కే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అంటున్నాడట నితిన్. 

 

యూత్ లో కీర్తి సురేష్ ఫాలోయింగ్ తెలుసుకున్నాడా లేక ఆమెతో చేయడం చాలా కంఫర్ట్ గా అనిపించిందో ఏమో కానీ కీర్తి సురేష్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అంటున్నాడట. ఇదేకాకుండా సూపర్ స్టార్ మహేష్ పరశురామ్ కాంబోలో సినిమా ఛాన్స్ కూడా కీర్తి సురేష్ కు దక్కిందని అంటున్నారు. మొత్తానికి తెలుగులో అమ్మడు ఫుల్ ఫామ్ కొనసాగిస్తుందని తెలుస్తుంది. 

 

మహానటి తర్వాత తమిళ సినిమాల్లో బిజీగా మారిన కీర్తి సురేష్ మరోసారి తెలుగు సినిమాల్లో తన సత్తా చాటాలని చూస్తుంది. కీర్తి సురేష్ గ్యాప్ ఇచ్చేసరికి పూజా హెగ్డే, రష్మికలకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పుడు లీగ్ లోకి కీర్తి సురేష్ కూడా వచ్చింది కాబట్టి ముగ్గురు మధ్య మంచి పోటీ జరిగేలా ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: