ప్రస్తుతం ప్రపంచం అంతటా వణికిస్తున్న కరోనా వ్యాధి వలన ఇప్పటికే దేశాలన్నీ కూడా తమ తమ ప్రజలను ఎక్కడికక్కడ ఇళ్లకు పరిమితం చేస్తూ లుకౌట్స్ ప్రకటించిన విషయం తెలిసిందే .ఇక మన దేశాన్ని కూడా 21 రోజులపాటు లాకౌట్ చేస్తునట్టు ప్రకటించారు మన ప్రధాని నరేంద్రమోడీ. అయితే ఈ లాకౌట్ వలన ప్రజల మధ్య సామజిక దూరం పెరిగి, కరోనా మరింతగా వ్యాప్తికాదని భవించి అన్ని దేశాలు దీనిని అమలు చేస్తున్నాయి. 

 

అయితే దీనివలన అట్టడుగు వర్గాల వారికి మాత్రం తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పనులు లేకపోవడంతో, కొందరు నిరుపేదలకు అయితే కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు తలెత్తాయి. అయితే ఆ విషయం గ్రహించిన మన ప్రభుత్వాలు అటువంటి వారికి రేషన్ తో పాటు కొంత ఆర్ధిక సాయాన్ని ప్రకటించినప్పటికీ, మేము కూడా అటువంటి వారికి సాయం చేస్తాం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ దయా గుణంతో ముందుకు వస్తూ విరివిగా విరాళాలు అందచేస్తున్నరు. ఇక ఎప్పుడూ కూడా ఇటువంటి కష్ట సమయంలో ప్రజలకు మేము తోడుగా ఉంటాం అని ముందుకు వచ్చే సినిమా పరిశ్రమ నుండి కూడా చాలామంది విరాళాలు అందించడం జరిగింది. 

 

ఇప్పటికే ఎందరో సినిమా ప్రముఖులు తమ శక్తి కొలది విరాళాలు అందివ్వగా, నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క, బావలైన గల్లా పద్మావతి, జయదేవ్ లు తమ అమర్ రాజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించడం జరిగింది. తొలిసారిగా తమ తనయుడు గల్లా అశోక్ ని వారు ఈ సంస్థ ద్వారా హీరోగా లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటువంటి కష్ట సమయంలో మా వంతుగా ప్రజలకు సాయం అందించాలని ఈ మొత్తాన్ని కరోనా విపత్తు నిధికి అందిస్తున్నట్లు తెలిపారు జయదేవ్......!!

మరింత సమాచారం తెలుసుకోండి: