కొన్ని కాంబినేషన్స్ వింటానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక ఆ కాంబోలు తెరకెక్కితే వచ్చే కిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తూంటారు. అలాంటి ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ..పవన్, మెగా పవర్ స్టార్ అభిమానులను ఆనందపరుస్తోంది. ఆ వార్త ఏమిటంటే...పవన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనపడనున్నారని. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆజ్ఞతవాసి సినిమా అనంతరం పవర్ స్టార్ ని బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమవుతోంది. ఈ నేపథ్యంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుసపెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా వెంటనే తన కెరీర్లో 27వ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఓకే చేసాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 28వ మూవీని కూడా లైన్లో పెట్టాడు. కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇది అభిమానులకు ఫుల్ జోష్ నింపింది.

 

అయితే రామ్ చరణ్.. బాబాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారిగా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ సినిమాలో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనగానే చాలా మంది ఫ్యాన్స్ ఇది రూమర్ కాకుండా నిజమైతే బావుండు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ పవన్ సినిమాలో నటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పింక్ సినిమాకు రీమేక్ గా వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో పవన్ డిఫరెంట్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది కమెర్షియల్ సినిమా కాదు. కేవలం కొన్ని పాత్రలతోనే నడిచే సోషల్ మెస్సేజ్ తో నడిచే కథ. ఈ విషయం ఇప్పటికే వచ్చిన 'పింక్', అజిత్ 'నెర్కొండ పార్వాయి' చిత్రం చూసిన వాళ్లెవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించే పాత్ర ఏమీ లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా చిరంజీవి 'ఆచార్య' మూవీలో స్పెషల్ రోల్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో చెర్రీ 'వకీల్ సాబ్' లో నటించే అవకాశమే లేదట.

 

ఇదిలా ఉండగా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి కరోనా కర్ఫ్యూ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని బోణీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, నివేధా థామస్, అనన్య మరియు ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇక ఈ సినిమా అనంతపురం పవన్ క్రిష్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఏ.ఎమ్. రత్నం నిర్మించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: