ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు టైం ప్రస్తుతం నడుస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేసుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్. ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఈ సినిమాతో సంక్రాంతి హిట్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఇండస్ట్రీలో మొత్తం సినిమా షూటింగులు మొత్తం ఆగిపోయాయి. మహేష్ కూడా నెక్స్ట్ సినిమా ఇంకా ఓకే చేయలేదు.

 

 

ఇటువంటి తరుణంలో తన కెరియర్ లో మర్చిపోలేని ‘అతడు’ మరియు ‘ఖలేజా’ లాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి పది సంవత్సరాలు అయ్యింది. ఇప్పటివరకు మరోసారి ఇద్దరూ కలిసి పని చేయలేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో హ్యాట్రిక్ విజయం సాధించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ అదిరిపోయే స్టోరీ రెడీ చేస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

 

సినిమాలు చేయకపోయినా 10 సంవత్సరాల కాల వ్యవధిలో ఇద్దరు కలిసి యాడ్స్ రూపంలో అయితే కలిసి పనిచేసారు. మహేష్ నటించిన చాలా యాడ్స్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. స్వయంగా మహేష్, త్రివిక్రమ్ పేరును రిఫర్ చేసాడు. సరైన కథ కుదరకే ఇన్నాళ్లూ ఇద్దరూ కలిసి పనిచేయలేకపోయారు. అయితే ఈసారి అది కచ్చితంగా జరుగుతుందని ఫిలింనగర్లో లేటెస్ట్ గా న్యూస్ వినబడుతోంది. ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఓకే అయితే మాత్రం ఎన్నాళ్లనుంచో మహేష్ ఫాన్స్ ఎదురుచూస్తున్న కాంబినేషన్ అవుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: