టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సొంత బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ తో పాటు, మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక కీలకమైన రోల్ కోసం మహేష్ బాబుని ఇటీవల సినిమా యూనిట్ అప్రోచ్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిదేమీ లేదని, అదంతా ఒట్టి పుకారు మాత్రమే అని, వాస్తవానికి ఆ రోల్ కోసం రామ్ చరణ్ ని తీసుకోవాలని తాము భావిస్తున్నట్లుగా మెగాస్టార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

 

అతి త్వరలో ఆ రోల్ పై రామ్ చరణ్ నటిస్తాడా లేదా అనేదానిపై స్పష్టత వస్తుందని మెగాస్టార్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా అనంతరం మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా హక్కులను కూడా రాంచరణ్ కొనుగోలు చేయడం జరిగింది. ఇక నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆ సినిమా మలయాళ వెర్షన్ లో విలన్ గా నటించిన వివేక్ ఓబెరాయ్ పాత్ర ని తెలుగులో ఒక యంగ్ హీరో పోషించనున్నట్లు చెబుతున్నారు. 

 

కొన్నేళ్ల క్రితం నటుడిగా సినీరంగానికి అడుగుపెట్టిన ఆ హీరో, ఇటీవల కొన్నాళ్లుగా మంచి విజయాలు అందుకుంటున్నాడని, అయితే ఈ మెగా మూవీలో విలన్ గా అతడు అయితేనే కరెక్ట్ అని భావించి, అతి త్వరలో నిర్మాత రామ్ చరణ్ అతడిని కలిసి క్యారెక్టర్ విషయమై చర్చించనున్నారని అంటున్నారు. అలానే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఒకరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని, అతి త్వరలో లాకౌట్ పూర్తయిన అనంతరం ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే, ఈ యువ హీరో రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే మరి. అయితే ఇంతకీ ఆ హీరో ఎవరా అంటూ మన టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఆసక్తికర చర్చలు మొదలెట్టేశారు......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: