సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేసిన హీరోయిన్ విజయశాంతి. ఆ తర్వాత స్టార్ హీరోలందరి తోను నటించింది. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది. అంతేకాదు లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోల రేంజ్ లో ను రెమ్యూనరేషన్ అందుకున్నారు. ఆ తర్వాత సినిమాలకి దూరమయ్యారు. తిరిగి  13 ఏళ్ళ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ రీ ఎంట్రీ సినిమాతో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

 

దాంతో సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత విజయశాంతి కి వరసగా అవకాశాలు వచ్చాయి. కాని ఆవిడ అన్ని సినిమాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం టాలీవుడ్ మెగా సుప్రీం హీరో సాయి తేజ్ దేవ కట్టా దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో నటించమని అడిగారని తాజా సమాచారం. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకోసం విజయశాంతి ని సంప్రదించారట. అయితే ఆవిడ పాత్ర నచ్చి చేస్తానన్నప్పటికి రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాక తప్పుకున్నట్టు తెలుస్తుంది. 

 

అయితే విజయశాంతి పాత్రలో ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలి సినిమాతో శివగామి గా బాగా పాపులారిటీని సంపాదించుకున్న రమ్యకృష్ణ ని ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా మొదలు పెట్టిన సినిమాని ఆపేశారు. పరిస్థితులన్ని చక్కబడ్డాక మళ్ళీ సినిమాని మొదలు పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కి సంబంధించిన అన్ని ప్లాన్స్ పక్కాగా వేసి పెట్టుకున్నారట చిత్ర బృందం. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ చేయబో పాత్ర ముఖ్యమంత్రి పాత్ర అని తెలుస్తుంది. ఇక ఇప్పటికే రమ్యకృష్ణ భర్త క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగ మార్తాండలో నటిస్తున్నారు. అయితే ఈ సినియర్ స్టార్స్ ఇద్దరికి కొన్ని పాత్రల్లో పోటీ బాగా ఉందని కాకపోతే రెమ్యూనరేషన్ విషయం లో కాంప్రమైజ్ కాక విజయశాంతి వెనకబడుతున్నారని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: