టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ రాజమౌళి త్రివిక్రమ్ సుకుమార్ కొరటాల శివ బోయపాటి ఈ విధంగా అందరు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నా మహేష్ కు ‘మహర్షి’ తో కెరియర్ బెస్ట్ ఇచ్చి ఒక విధంగా మహేష్ ను నమ్ముకుని ఇప్పుడు ఎటూ కాకుండా అయిపోయిన వంశీ పైడిపల్లి పై ప్రస్తుతం ఇందాస్త్రీలోని చాలామంది సానుభూతి చూపెడుతున్నారు. వివాదాలకు దూరంగా మృదుస్వభావిగా పేరు గాంచిన వంశీ పైడిపల్లి మహేష్మూవీ చివరి నిముషంలో క్యాన్సిల్ కావడంతో ఇతడి పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా మారింది.


వంశీ పైడి పల్లిని అభిమానించే జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చేయబోయే ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ తో ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ప్రభాస్ కూడ నాగ్ అశ్విన్ తో భారీ మూవీ ప్రాజెక్ట్ కు ఒకే చెప్పడంతో సాన్నిహిత్యం ఉన్నా వంశీ పైడిపల్లి కి అవకాశాలు లేవు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దగ్గర చిక్కుకోవడంతో ఆ మూవీ పూర్తి అయ్యే దాకా మరో దర్శకుడుకి ఛాన్స్ లేదు. 


ఇలాంటి పరిస్థితులలో వంశీ పైడిపల్లి లేటెస్ట్ గా కరోనా సమయంలో ఖాళీగా ఉన్న చరణ్ కు ఒక కథ చెప్పాడు అని వార్తలు వస్తున్నాయి. పూర్తి సాఫ్ట్ ఎలిమింటే తో యూత్ కు బాగా నచ్చే ఒక లవ్ స్టోరీని చరణ్ కు వంశీ పైడిపల్లి చెప్పినట్లు సమాచారం. ఈకథలో కూడ చిన్న సోషల్ మెసేజ్ ఉంటుంది అని అంటున్నారు. 


అయితే రామ్ చరణ్ కు వంశీ చెప్పిన కథ నచ్చినా అతడి దృష్టి పూర్తిగా కొరటాల శివ పై ఉంది. ‘ఆచార్య’ మూవీ తరువాత తిరిగి తనతోనే మరొక సినిమా చేసే విధంగా చరణ్ ‘ఆచార్య’ ప్రారంభం ముందే కొరటాలతో ఒక ఎగ్రిమెంట్ చేసుకున్నాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే ‘ఆచార్య’ మూవీ రకరకాల కారణంతో ఆలస్యం అవ్వడంతో అసహనంలో ఉన్న కొరటాల మళ్ళీ తన తదుపరి సినిమాను చరణ్ తో చేసేకంటే ఈసారి తన మూవీ అల్లు అర్జున్ తో చేయాలి అన్న ఆలోచనలలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో టాప్ హీరోలు ఎవరు అందుబాటులో లేని వంశీ పైడిపల్లి చరణ్ తో చేసిన రాయబారం ఫలిస్తే తప్ప ఇక ఎవ్వరు ప్రస్తుతానికి వంశీ పైడిపల్లికి అందుబాటులో లేరు అంటూ 100 కోట్ల కలక్షన్స్ వచ్చిన ‘మహర్షి’ దర్శకుడు కి వచ్చిన అనుకోని కష్టాల పై కొంతమంది జాలిపడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: