టాలీవుడ్ లో మహేష్ బాబుకి భారీగా క్రేజ్ ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు పోటీ పడుతూ ఉంటారు. టాలీవుడ్ లో అగ్ర దర్శకులు కూడా మహేష్ బాబు తో సినిమా కోసం వేరే సినిమాలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంటుంది. కాని అది ఇప్పుడు మారిపోయింది. మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి అంటే భయపడే పరిస్థితికి నిర్మాతలు వచ్చేశారు అనే విషయం కొన్ని రోజులుగా స్పష్టంగా అర్ధమవుతుంది. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు. 

 

దర్శకుడు మహేష్ తో సినిమా చేయడానికి ముందుకి వచ్చినా సరే నిర్మాతలు మాత్రం ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఎక్కువగా ఉన్నారు అనేది టాలీవుడ్ లో కొన్ని రోజుల నుంచి ఎక్కువగా వినపడుతున్న మాట. మహేష్ బాబు ఇప్పుడు కొన్ని కొన్ని మార్పులు తనలో చేసుకున్నాడు అంటున్నారు. గతంలో మహేష్ బాబు కొత్త ఆలోచన చేసాడు. ఏంటీ అంటే సినిమా ముందు మార్కెట్ మొత్తం తాను తీసుకోవాలని. అలా చేస్తే ఎక్కువగా నిర్మాతలు నష్టపోతున్నారు. అప్పుడు మహేష్ కి ఇచ్చే పారితోషికమే దాదాపు 80 కోట్ల వరకు ఉంటుంది. 

 

నిర్మాత కూడా నాకు అలా అయితే ఏమీ మిగిలే అవకాశం ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా మనం చూసాం. దీనితో రెమ్యునరేషన్ ఒక్కటే తీసుకోవాలని మహేష్ బాబు భావిస్తున్నాడు. ఇక సినిమా  నిర్మాణం లో తాను వేలు పెట్టే ప్రయత్నం చేయవద్దు అని కూడా మహేష్ బాబు భావిస్తున్నాడు. మహేష్ బాబు ఇలా చెప్పడం తో ఇప్పుడు ఆయనతో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు ముందుకి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయనతో సినిమా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకి వచ్చిన పరిస్థితి దాదాపుగా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: