మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అనే సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ఏ విధంగా కనిపించే అవకాశం ఉందనే చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. మహేష్ బాబు  ని కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతూ వస్తుంది. టాలీవుడ్ లో ఈ సినిమా కోసం చాలా మంది ఎదురు చూసే పరిస్థితి కూడా ఉందీ అనేది వాస్తవం. చిరంజీవి ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

 

ఇక ఈ సినిమాలో ఆయన మావోయిస్ట్ గా కనిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నాయి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవిసినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఆయన సీరియస్ గా ఉన్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం ఏంటి అనే దానిపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అది ఏంటీ అంటే... ఈ సినిమా ను ముందే షూటింగ్ చేద్దామని చిరంజీవి భావించినట్టు సమాచారం. ఈ సినిమాను సైరా సినిమా అయిన వెంటనే షూట్ కి తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఆయన ఉన్నారట. 

 

కాని ఈ సినిమాను వాయిదా వేసారట. కావాలనే రామ్ చరణ్ ఈ సినిమాను కొన్ని కారణాలతో వాయిదా వేసాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ వచ్చింది. ఇక కొరటాల శివ కూడా ఖాళీ గా ఉన్నా సరే కథను అనుకున్న వేగంగా రెడీ చేయలేదు అనే భావనలో చిరంజీవి ఉన్నారు. లేకపోతే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయి ఉండేది అని చిరంజీవి ఇప్పుడు భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: