టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల హవా ఎక్కువగా ఉంది అనేది అర్ధమవుతుంది. చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ అనే తేడా లేకుండా హీరోయిన్లు ఇప్పుడు టాలీవుడ్ లో తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్ లు మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయారు. వరుసగా ఆఫర్లు రావడం తో ఆ ఇద్దరు చెప్పిందే జరుగుతుంది టాలీవుడ్ లో అనేది ఎవరూ కాదు అనలేని వాస్తవం. వాళ్ళు ఇద్దరే రష్మిక మంధనా పూజే హెగ్డే. రష్మిక ఈ ఏడాది రెండు సినిమాలను హిట్ కొట్టింది. పూజ హెగ్డే ఒక సినిమా హిట్ అయింది. 

 

దీనితో ఇప్పుడు వీరి హవా ఎక్కువగా ఉంది అనే విషయ స్పష్టంగా అర్ధమవుతుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ లు చాలా సౌమ్యంగా ఉండే వాళ్ళు. కాని ఇప్పుడు కాస్త దూకుడుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అలాగే ఉన్నారు. తమకు పోటీ అనేది లేదు అని భావించిన ఈ ఇద్దరు తమ డిమాండ్ లను నిర్మాతల ముందు పెడుతున్నారు. తమ సినిమాలు అన్నీ వేగంగా పూర్తి చెయ్యాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వేగంగా సినిమాలు పూర్తి చేస్తే తాము ఇతర భాషల్లో సినిమాలు చేసుకునే అవకాశం ఉంటుంది అనే భావనలో వాళ్ళు ఉన్నారని సమాచారం. 

 

అందుకే ఇప్పుడు ఇతర భాషల మీద దృష్టి పెట్టి ప్రస్తుతం కొత్తగా తెలుగులో సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. వాటిని వేగంగా పూర్తి చేసే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు అనే విషయం అర్ధమవుతుంది. అంతే కాదు కరోనా తర్వాత సినిమాలు అన్నీ వేగంగా షూటింగ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేగంగా షూటింగ్ ని పూర్తి చేసుకునే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సినిమాల షూటింగ్ అనేది జరగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: