బాలీవుడ్ ఇండస్ట్రీని కరోనా భయపెడుతోంది. ఇప్పటికే లాక్ డౌన్‌ కారణంగా బాలీవుడ్ వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. దీనికి తోడు సినీ ప్రముఖులు కూడా కరోనా పాజిటివ్‌గా తెలుతుండటం ఇండస్ట్రీ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. ఇటీవల కనికా కపూర్‌ వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసింది. కరోనా సోకిన తరువాత ఆమె అనేక మందితో కలిసి పార్టీల్లో పాల్గొనటం సంచలనంగా మారింది. ఇటీవల కనికా కరోనా నుంచి బయట పడి డిశ్చార్జ్‌ అయ్యింది.

 

తాజాగా బాలీవుడ్‌ ఇండస్ట్రీ మరో షాకింగ్ న్యూస్‌ షేక్‌ చేస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ కరిమ్ మోరాని కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన కరిం కూతురు షాజా ముందుగా కరోనా పాజిటివ్‌ గా తెలింది. ఈ విషయాన్ని కరిం స్వయంగా ప్రకటించారు. అయితే ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు కూడా టెస్ట్ చేయించుకోవటంతో ఆయన రెండో కూతురు జోయాతో పాటు తాను కూడా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలవరం మొదలైంది.

 

కరింకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టుగా ఆయన సోదరుడు మొహమ్మద్‌ మోరానీ అధికారికంగా ధృవీకరించాడు. ప్రస్తుతం ఆయన నానావతి ఆస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, ఇంట్లో ఆయన భార్య, పనివారికి కూడా టెస్ట్ లు నిర్వహించారని వారందరికీ నెగెటివ్‌ వచ్చినట్టుగా ఆయన వెళ్లడించారు. కరిం షారూఖ్‌ ఖాన్ హీరోగా తెరకెక్కిన రావన్‌, చెన్నై ఎక్స్‌ ప్రెస్‌, హ్యాపీ న్యూ ఇయిర్‌, దిల్ వాలే లాంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Producer #karimmorani tests positive for #covid19 A 25-year-old woman had filed a sexual harassment case against Morani in 2018 and the filmmaker is out on bail at present. #lockdownextension #metoo #mentoo #metooindia #coronavirus #bollywood #kanikakapoor

A post shared by Men’s Day Out (@mensdayoutindia) on

మరింత సమాచారం తెలుసుకోండి: