దాదాపు నాలుగు చిత్రాల వరకు ఫ్లాప్ టాక్ని అందుకున్న సాయిధరమ్తేజ్ `ప్రతీ రోజు పండగే` చిత్రంతో హిట్ని అందించాడు మారుతి. అయితే ఆ తరువాత నుంచి ఫ్లాప్ హీరోకి హిట్ ఇచ్చానని మాత్రం తెగ ఫీలవుతున్నాడట. తన తదుపరి చిత్రం కూడా భారీ స్థాయిలోనే వుండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక ఏ డైరెక్టర్ అయినా సరే అదే పనిలో ఉంటాడు. ఇక ప్రస్తుతం మారుతి తన తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్తో మారుతి సినిమాని ప్లాన్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై తాజాగా స్పందించాడు.
తన తదుపరి చిత్రం పై ఓ సెక్షన్ మీడియావాళ్ళు మాత్రం అతి చేస్తోందని, తెగ ఆసక్తిని చూపిస్తోందని, అందుకు థ్యాంక్స్ అని సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇక తన తదుపరి చిత్రం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ వట్టి పుకార్లేనని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతం కొత్త కథ రాస్తున్నానని ఆయన తెలిపారు. అది పూర్తవడానికి సమయం పడుతుందని, స్క్రిప్ట్ పూర్తయ్యాకే పూర్తి వివరాల్ని తెలియజేస్తానని చెప్పేశాడు.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న వేళ మారుతి సినిమా గురించి ఎవరడిగారని, ఈ సమయంలో ఇలా సోషల్ మీడియాలో మెసేజ్ ఇవ్వడం ఏమిటని... చేయడం అతిగా లేదు అని మారుతి పై సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇక అందరిది ఒక గోల అయితే నాది ఒక గోల అన్నట్లు ఉంది. ఏది ఏమైనప్పటికీ సినిమా షూటింగ్లన్నీ మొదలయ్యేసరికి కనీసం జూన్ అని అంటున్నారు. మరి అవన్నీ మొదలై షూటింగ్లు అయ్యేసరికి మరో సంవత్సరం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ లోపు చాలా మంది నిర్మాతలకి చాలా సినిమాలు విడుదలవక మొత్తం ఇండస్ట్రీనే అవకతవకలవుతుంది. ఇంత విపత్కర పరిస్థితులు ఎప్పుడూ కూడా రాలేదు. మరి ఇలాంటి సమయంలో ఏమి చెయ్యాలో ఎవ్వరికీ అర్ధం కాని పరిస్థితులు ఈ ఎఫెక్ట్ కేవలం సినిమాల పైనే కాదు ఇది బుల్లి తెర అయిన సీరియల్స్ పైన కూడా ఈ ఎఫెక్ట్ బాగానే పడిందని చెప్పాలి.