ఏ రంగంలో అయినా మ‌గ‌వాళ్ల ఆధిప‌త్యం అనేది ఉంటూనే ఉంటుంది. ఆడ‌వాళ్లు మ‌గ‌వాళ్ల‌తో పోటీప‌డుతూ అంత‌ర‌క్షింలోకి వెళ్లినా కూడా ఇంకా మ‌గోళ్ల ఆధిప‌త్యం అనేదానికి బ్రేకులు అయితే లేవు. ఈ క్ర‌మంలోనే సినిమా ఇండ‌స్ట్రీలోనూ హీరోల ఆధిప‌త్యం ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు హీరోయిన్లు మిన‌హా ఇక్క‌డ హీరోల ఆధిప‌త్య‌మే ఎక్కువ‌. ఇదిలా ఉంటే తాజాగా సీనియ‌ర్ హీరోయిన్ న‌దియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టింది. దీంతో చాలా మంది సోష‌ల్ మీడియా వాళ్లు.. వెబ్ సైట్ల రైట‌ర్లు ప‌వ‌న్ అత్త‌, ప్ర‌భాస్ అమ్మ సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింద‌ని రాశారు.

 

అంటే ఆ రాత రాసినోళ్ల‌కు ఆమె గురించి అంత‌కు మించి ఏం తెలియ‌ద‌నే చెప్పాలి. అయితే వాస్త‌వంగా న‌దియా 1984 - 1988 మ‌ధ్య న‌దియా త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో ఓ టాప్ హీరోయిన్‌. ఆమె అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీని తన అంద చందాల‌తో ఓ ఊపు ఊపేశారు. తెలుగులోనూ ఆమె అప్ప‌ట్లో కొన్ని సినిమాల్లో న‌టించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడు మ‌హేష్ అన్న ర‌మేశ్‌బాబు ప‌క్క‌న ఆమె బ‌జార్‌రౌడీ సినిమాలో న‌టించారు. ఆమె అస‌లు పేరు జ‌రీనా మెయిదు. ఆమె తండ్రి ముస్లిం, త‌ల్లి హిందు.

 

చివ‌ర‌కు న‌దియా ఓ హిందూను పెళ్లి చేసుకుంది. ఆమె అమెరికాలో మాస్ క‌మ్యునికేష‌న్స్‌లో డిగ్రీ, మీడియా మేనేజ్‌మెంట్‌లో మ‌రో డిగ్రీ చేశారు. ఆమె వ‌య‌స్సు ఇప్పుడు 54 ఏళ్లు. అమెరికాలో కొన్నాళ్లు.. ఆ త‌ర్వాత లండ‌న్‌లో ఉన్న ఆమె ఇప్పుడు చెన్నైలో ఉంటుంది. అది న‌దియా అస‌లు క‌థ‌. అంతే కాని ఆమెను ప‌వ‌న్ అత్త అనో... ప్ర‌భాస్‌కు అమ్మ అనో.. వెంక‌టేష్‌కు విల‌న్ (దృశ్యం సినిమాలో ) అని రాయ‌క్క‌ర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: