ప్రస్తుతం అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై అఖిల్ బోలెడు ఆశలే పెట్టుకుని ఉన్నాడు. అఖిల్ నటిస్తున్న ఈ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ అక్కినేని బుధవారం నాడు 26వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ యంగ్ హీరోకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. అఖిల్‌కు మంచి భవిష్యత్ ఉండాలని భావిస్తున్నామని వారు తమ అభినందనలు వెల్లడించారు. కానీ అక్కినేని ఫ్యామిలీకి చెందిన ఇతర సభ్యులు మాత్రం అఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదు. 

 

బర్త్ డే అంటే సెలెబ్రేట్ చేసుకోకపోయినా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం సాధారణంగా ఈ రోజుల్లో జరుగుతున్నదే. కానీ అన్నా వదినలు నాగ చైతన్య, సమంత, సుమంత్ లాంటి వారు కూడా ఈసారి అఖిల్‌కు సోషల్ మీడియాలో విషెస్‌ చెప్పలేదు. ప్రతి ఏడాది తమ సోషల్ మీడియాలో అఖిల్‌కు విష్‌ చేస్తూ వస్తోన్న వీరు ఈసారి చెప్పకపోవడంపై ఫ్యాన్స్‌ ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా అని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీలో ఏమైనా గొడవలు వచ్చాయా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరేమో సోషల్ మీడియాలో చెప్పకపోయినప్పటికీ.. ఫోన్ చేసి చెప్పి ఉండచ్చు కదా అన్న కామెంట్లు పెడుతున్నారు.

 

మరి అఖిల్‌కు వారు విషెస్‌ చెప్పారా..?, కరోనా నేపథ్యంలో విషెస్ వద్దనుకున్నారా..?, అక్కినేని కుటుంబంలో అంతా ఓకేనా అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో నాగ చైతన్య - సమంత ఒక చోట ఉండగా.. అఖిల్, నాగార్జున, అమల మరో చోట ఉన్నారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే సాదాసీదాగా పుట్టినరోజును జరుపుకున్నారు అఖిల్. బర్త్ డే సందర్భంగా అఖిల్ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: