టాలీవుడ్ లోకి కెరటం మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది రకూల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి పేరు సంపాదించింది రకూల్. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో వరసగా సినిమా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అప్పటి టాప్ హీరోలు రకూల్ ప్రీత్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలాంటిదో చెప్పొచ్చు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉండటంతో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రకూల్ తన ఇంటి పరిసర ప్రాంతాల్లో పేద వారి కోసం తన ఇంట్లో భోజనాలు వండి వారికి ఇస్తుంది.
ఇది తన కర్తవ్యం అని.. ప్రతి ఒక్కరూ ఈ విపత్కర సమయంలో పేదవారిని ఆదుకోవాలని అంటుంది. అంతేకాదు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. సాధారణంగా సినీ నటులు అనగానే వాళ్లకు వారితో.. వీరితో అఫైర్లు ఉన్నాయంటూ వార్తలు రావడం సహజం. ఆ మద్య రకూల్ కి కూడా లవ్ లో పడిందంటూ ఆమెపై కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. అయితే రకుల్ ఎప్పుడూ ఎక్కడా ఎవరితోను కలిసి కనిపించకపోవడంతో, ఆమెపై జరిగిన పుకార్లకు ఫుల్ స్టాప్ పడిపోయింది. తాజాగా తన తమ్ముడు అమన్ సింగ్ గురించి మాట్లాడుతూ.. నేను లవ్ లో పడ్డానంటూ వచ్చిన పుకార్లను నేను ఎపుడూ పట్టించుకోలేదు.
ఎందుకంటే వాటిలో నిజం లేదనే విషయం నాకే కాదు, నా కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. మరో విషయం ఏంటంటే.. నేను లవ్ లో పడే ఛాన్సు కూడా మా తమ్ముడి వల్ల ఉండదని అంటుంది. చిన్నప్పటి నుంచి కూడా వాడు గూఢచారిలా నన్ను ఫాలో అయ్యేవాడు. నేను ఏ అబ్బాయితో మాట్లాడినా వెంటనే ఇంట్లో చెప్పేసేవాడు. వాడి భయం కారణంగా నేను అబ్బాయిలతో మాట్లాడటమే మానేశాను. వాడు అంటే నాకు అదోరకం భయం.. అందుకే నేను ఇప్పుడు సింగిల్ గానే ఉన్నాను అంటుంది.