కరోనాతో ఇప్పుడు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు నానా ఇబ్బందులు పడుతున్నారు.  కరోనా మహమ్మారి ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికే సోకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో మొదట ఈ కరోనా లక్షణలు కేరళాలో బయట పడ్డాయి. తాజాగా దర్శకుడు పద్మకుమార్ తనయుడు ఆకాశ్‌ కరోనా వైరస్ భారి పడ్డారు.  పద్మకుమార్‌ తనయుడు ఆకాశ్‌ పారిస్‌లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ స్నేహితుడు ఎల్దో మాథ్యూతో కలిసి మార్చి 15న కేరళకు తిరిగి వచ్చాడు.

 

 విదేశాల నుంచి వచ్చినవారందరినీ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. అయితే కరోనా లక్షణాలు బయటపడటంతో కలామాసెరీ మెడికల్‌ కాలేజీలో ఆకాశ్‌, మాథ్యూకు చికిత్స అందించారు.  ఇటీవల మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. దాంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  ఈ విషయాన్ని పద్మకుమార్‌ సోషల్‌ మీడియాలో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు.  ఇంత కష్టతరమైన రోజుల్లో కరోనా బారిన నా కుమారుడు ఆకాశ్‌, తన స్నేహితుడు ఎల్దో మాథ్యూ కోలుకున్నారు.

 

అయితే కరోనా బాధితుల కోసం అంకిత భావంతో పని చేస్తున్న  డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు.  అలాగే కెప్టెన్‌, గౌరవనీయ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆరోగ్య శాఖా మంత్రి శైలజా టీచర్‌... జిల్లా కలెక్టర్‌ సుహాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  ఇటీవల   మమ్ముట్టి ప్రధాన పాత్రలో పద్మకుమార్‌ తెరకెక్కించిన మామాంగం సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: